మోకాళ్ళతో మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ..!

-

అతిలోక సుందరి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈమె పేరు మారుమోగిపోతోంది. టాలీవుడ్ లో బడా ప్రాజెక్టుల లో ఇన్వాల్వ్ అయ్యింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ లో ఈమె ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు తాజాగా ఈ బ్యూటీ తిరుమల లో సందడి చేస్తోంది.

తన స్నేహితులు బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది కాలినడకన మెట్ల మార్గం గుండా వెళ్లడమే కాకుండా మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళతో తిరుమల మెట్లు ఎక్కింది జాన్వి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వికి తెలుగులో మంచి అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో మంచి సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగడానికే మోకాళ్ళతో శ్రీవారిని దర్శించుకుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news