దయచేసి నన్ను నమ్మండి.. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!

-

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఎన్నికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇందులో నా మీద నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా నన్ను ప్రకటించినందుకు మాజీ సీఎం కేసీఆర్ కి దన్యవాదాలు తెలియజేశారు. అలాగే నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, పేద ప్రజలకు ఇచ్చిన మాట తప్పనని అన్నారు.

అంతేగాక నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్ములను బాధ పెట్టి ఉండవచ్చని, ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని చెప్పారు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, నా మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు, కొందరు ఆప్తులతో సహా తీవ్రమైన దాడి చేశాయని, ఇంకా చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు. నన్ను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న నా లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news