సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం

-

దేశంలో తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్​ ముగియనుంది. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్​ 1వ తేదీన ముగియనుంది. జూన్​ 4న కౌంటింగ్ జరగనుంది.

తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు  పోలింగ్‌ జరుగుతోంది.  ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది.

తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్​లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్ , సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మణిపుర్​లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మొదటి రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news