Telangana: అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి!

-

అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి చెందిన ఆ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన పూసాల మధుసూధన్, భార్య సంధ్య వ్యవసాయం సాగు చేస్తున్నారు.

ఇటీవల జరిగిన పంట నష్టాల భారంతో రూ. 10 లక్షల వరకు అప్పులు పెరిగాయి. దీంతో మనస్తాపం చెంది ఈనెల 14న పొలం వద్ద పురుగుల మందు తాగారు. సంధ్య కోలుకోగా మధుసూధన్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news