కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి : పొన్నం ప్రభాకర్‌

-

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.హిందు సంస్కారం తెలియని వ్యక్తి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక్కడి వాళ్ళను చేసుకున్నాక.. సోనియాగాంధీ ఇక్కడి మనిషి అయ్యిందన్నారు. దేశ సంస్కారం తెలియని వ్యక్తి కేంద్ర మంత్రి అవ్వడం అవమనకరమని మండిపడ్డారు.

మొదటి దశ ఎన్నికల తర్వాత ప్రధాని హోదాలో ఉన్న ఆయన గౌరవం లేకుండా మట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు గుడిలో ఉండే దేవుణ్ణి రోడ్డు మీదకు తెచ్చారన్నారు పొన్నం ప్రభాకర్. కిషన్ రెడ్డిని హనుమాన్ చాలీసా చూడకుండా చదవమని చెప్పారు. పదేళ్లు పని చేయించుకుని సిరిసిల్ల చేనేతలకు డబ్బులు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతల పాపంతోనే చేనేతలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని,తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు ఇచ్చామని వెల్లడించారు. పాత బకాయిలు మేము ఇస్తున్నాం.. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు పొన్నం ప్రభాకర్ .

Read more RELATED
Recommended to you

Latest news