BREAKING: కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

-

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.

కాగా, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కేసిఆర్ కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news