మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ కావడం ఖాయం : ఈటెల రాజేందర్

-

దేశంలో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికవుతారని.. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో కురుమల ఆత్మీయసమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.


కేసీఆర్ నాయకులను ప్రలోభ పెట్టడం, వారి అనుభవాలకు వెల కట్టడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యల వల్ల ప్రజాక్షేత్రంలో పలచబడిపోయిన సంగతి మనకు తెలిసిందే. నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పద్దతి పాటిస్తున్నాడు. కానీ వారి పాచికలు పాడవు అని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలు మాత్రమే ఓట్లు వేసి గెలిపించగలరు. మళ్లీ ప్రధాని తప్పకుండా నరేంద్రమోదీ అవుతారని ఖాయమే. మళ్లీ మోదీగారు వస్తే రిజర్వేషన్లు ఉండవని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. పదేళ్లుగా ప్రధాని మోదీ రిజర్వేషన్లు తీసేసారా. ఇక ముందు మాత్రం ఎందుకు జరుగుతుంది. నిమ్న జాతులకు, వర్గాలకు రిజర్వేషన్లు ఎప్పటికీ ఉంటాయని హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలని, అబద్దపు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news