10-12 సీట్లు ఇవ్వండి.. మళ్లీ కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారు – KTR

-

10-12 సీట్లు ఇవ్వండి.. మళ్లీ కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని తెలిపారు KTR. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని.. మహిళలకు రూ. 2,500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, రైతు భరోసా, బోనస్, తులం బంగారం, స్కూటీలు ఇలా ఎన్నో హామీలు చెప్పారు.

23 people arrested in case of stone attack on KTR

ఏదైనా ఒక్కటైనా అమలైందా? అని నిలదీశారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు.. మరి రుణమాఫీ అయ్యిందా? పెద్దపల్లి అభ్యర్థి కోటీశ్వరుడు కదా? ఆయన అయినా సరే ఇచ్చిండా రైతులకు ఏమైనా ఇచ్చిండా? అని ఫైర్‌ అయ్యారు. అయిన సరే మొండి చెయ్యికి గుద్దుదామా? కాంగ్రెస్ మళ్లీ ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news