BREAKING : బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 8 మంది సజీవదహనం

-

ఇటీవల పల్నాడు బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనమైన ఘటన మరవకముందే మరో ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరికొందరు బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటనలో ఎనిమిది మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news