ఆరు నెలల్లో భారత్ లో పీవోకే విలీనం ఖాయం : సీఎం యోగి

-

మరో కొన్ని నెలల్లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.  నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ప్రసంగించారు. గత పదేళ్లల్లో నవభారత నిర్మాణాన్ని చూశామని, సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశామని, ఉగ్రవాదాన్ని అరికట్టామని యోగి తెలిపారు.

మూడేళ్లుగా పాకిస్థాన్‌లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న యోగి ఆదిత్యనాథ్‌ .. దానివెనక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయని పేర్కొన్నారు. భారత ప్రజలను చంపినవారిని మనం పూజించలేం కదా అన్న యోగి.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పీవోకేను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా యత్నిస్తోందని, కానీ, అలా జరగదని పేర్కొన్నారు. “మరో ఆరు నెలల్లో అది పూర్తిగా భారత్‌లో విలీనమవుతుంది. కానీ.. మూడోసారి కూడా మోదీయే ప్రధానిగా బాధ్యత వహిస్తేనే అది జరుగుతుంది’’ అని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news