వనపర్తి జిల్లాలో సాధువులపై దూసుకెళ్లిన డీసీఎం.. ముగ్గురు దుర్మణం

-

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాధువులపైకి ఓ డీసీఎం దూసుకెళ్లింది. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సాధువులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు నుంచి కర్నూలు వైపు గుజరాత్‌కు చెందిన సాధువుల బృందం నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం అటుగా వెళ్తున్న ఓ డీసీఎం వాహనం వారిని కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి 108కు ఫోన్ చేయగా వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

 

Road accident in Kurnool Medical student killed

Read more RELATED
Recommended to you

Latest news