ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయినా మరో లంచగొండి

-

తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తోంది. చిన్న పనులకు కూడా లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ, ప్రజల కష్టార్జితాన్ని పిలిచి పిప్పి చేస్తున్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది.

తాజాగా లంచం తీసుకుంటూ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఓ కేసు విషయంలో సుధాకర్ మూడు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని సుధాకర్ నగదు తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం సీసీఎస్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news