వెంకట్రామిరెడ్డి పై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

-

మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిన్న కేసీఆర్ పై కేసు నమోదు అయిందని.. హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో గెలిస్తే రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని ప్రకించినట్లు గుర్తుచేశారు. అంత డబ్బు ఆయన ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుల వివరాలు కూడా ప్రజలకు తెలియజెప్పాలని అన్నారు. వెంకట్రామిరెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే బీఆర్ఎస్ కి ఒక్క సీటు రాకపోవడానికి కారణం అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని తెలిపారు. సుల్తానాబాద్ లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. పెద్దపెల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లో లో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న బలరాం అనే దుండగుడు సమీపంలోని పొదల్లోకి ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news