బాబు కీలక నిర్ణయం.. టీడీపీ అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు

-

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

The party allotted a bullet proof car to Palla Srinivasa Rao

కాగా, గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించానని ,స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు పల్లా. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా ప్లాంట్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు యువ నాయకుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.స్టీల్ ప్లాంట్ ఆదుకోవడం తప్పా తనకు ఏ పదవి ముఖ్యం కాదని ఉద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news