కేసీఆర్‌ తన సన్నిహితుల కోసం సింగరేణిని బొంద పెట్టారు: భట్టి

-

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సన్నిహితుల కోసం సింగరేణిని బొంద పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం జరిగితే పాల్గొనకుండా.. ఒడిశాలో జరిగిన వేలంలో పాల్గొన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ వ్యక్తే బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారని.. సింగరేణిని కాపాడాలని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్తులను, వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి బంద్‌ అయితే చాలా మందికి ఉద్యోగాలు ఉండవని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సహకరించాలి భట్టి విక్రమార్క కోరారు.

ఖమ్మంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భట్టి విక్రమార్క సింగరేణి గనుల వేలంపై మాట్లాడారు. ‘సింగరేణి గని అంటే.. ఉద్యోగాల గని. సింగరేణి తెలంగాణకే తలమానికం. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్‌, 22 వేలమంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. 2030 కల్లా 15 మిలియన్‌ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది.’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news