ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి ఆ పథకం అమలు!

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న శుభవార్త చెప్పనుంది. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 రోజున అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ లో ప్రారంభించే 183 క్యాంటీన్ల కు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్ల ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో పుర, నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news