వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్.. కలెక్టర్ కు ఫిర్యాదు!

-

Congress MLA Vinod complaint to the collector in the dispute: కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏతో తనకు ప్రాణహాని ఉంది అంటూ ఓ మహిళ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్‌తో తనకు ప్రాణ హాని ఉందని బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలిపింది.

బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండగానే ఒంటరి మహిళా పింఛన్ పొందుతున్నదని కలెక్టర్‌కు మమత ఫిర్యాదు చేసింది. దీంతో పగ పెంచుకున్న విక్టోరియా కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్ బెల్లంపల్లిలో తిరగనివ్వనని, చంపేస్తానని ఫోన్‌లో బెదిరిస్తున్నట్లు మమత వాపోయింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news