ఢిల్లీకి బయలుదేరిన జగన్‌…అసెంబ్లీకి డుమ్మానే ?

-

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు జగన్‌. జగన్‌ తోపాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి పయనం అయ్యారు. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్నారు వైఎస్ జగన్.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్‌ చేసుకున్నారు.

Jagan’s strong warning to the police 

ఇందులో భాగంగానే.. కాసేపటి క్రితమే ఢిల్లీకి పయనం అయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు….వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఏపీ లో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా ధర్నా చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

Read more RELATED
Recommended to you

Latest news