Telangana: బొగత జలపాతంలో దిగి.. యువకుడు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగత జలపాతంలో దిగి.. యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో దిగి ఓ యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన బొనగాని జస్వంత్(19) అనే యువకుడు తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేందర్, ప్రశాంత్ తో బొగత జలపాతానికి వచ్చారు.

A young man died after landing in Bogata waterfall

అనంతరం జలపాతంలో స్నానాలు చేసేందుకు నీటిలోకి దిగగా.. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో జస్వంత్ నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి సాయంత్రానికి మృTHA దేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news