BREAKING : ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హావ్‌డా-ముంబయి ఎక్స్‌ప్రెస్‌

-

ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి కారణాలతో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రమాదాలను అధికారులు నివారించలేక పోతున్నారు. తాజాగా ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద హావ్‌డా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు గుర్తించారు. క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు. ఇది సాంకేతిక సమస్య వల్ల జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news