దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సొంత చెల్లెల్ని పట్టించుకోని వాళ్లు కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలువలేని హరీశ్ రావును మంత్రిని చేసింది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ కు సింగిల్ విండో పదవీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే  అని అన్నారు.

వాళ్లు నమ్మిన సొంత చెల్లెలు తీహార్ జైలులో ఉందని.. ప్రస్తుతం దొర చేతిలో అక్కలు చిక్కుకున్నారని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలనుద్దేశించి సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత సభ రావడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క పై అవమానకర రీతిలో మీమ్స్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ఇస్తే. శాపనార్థాలు పెడుతున్నారని ఇవ్వకపోతే పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news