ఏపీలో మరో హత్య…65 ఏళ్ల వృద్దుడుపై రాళ్లు, కర్రలతో దాడి చేసి !

-

ఏపీలో మరో హత్య చోటు చేసుకుంది…65 ఏళ్ల వృద్దుడుపై రాళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి నంద్యాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మహానంది ( మం) సీతారామపురంలో (65) ఏళ్ల వృద్దుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్య జరిగింది. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు ప్రత్యర్ధులు.

A 65-year-old man was attacked with stones and sticks

ఇంట్లోని సామగ్రిని , వస్తువులను ధ్వంసం చేశారు ప్రత్యర్థులు. రాళ్లతో , కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు పెద్ద సుబ్బారాయుడు. పాత కక్షలే కారణం పెద్ద సుబ్బారాయుడును హత్య చేశారని అంటున్నారు స్థానికులు. ఇక గ్రామంలో ఉద్రిక్తతగా ఉండటంతో మోహరించాయి పోలీస్ బలగాలు. గ్రామాన్ని చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news