BREAKING: వైసీపీ నేత సుబ్బరాయుడు హత్య..40 మంది దాడి చేసి మరీ !

-

BREAKING: ఏపీ లో క్రైం రేట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.. హత్యలు మరింత పెరిగాయి. అయితే.. తాజాగా నంద్యాలలో దారుణ హత్య జరిగింది. నంద్యాలలోని మహానంది మండలం సీతారామరాజు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత సుబ్బరాయుడు ఇంటికి పై దాడి చేసి హత్య చేశారు ప్రత్యర్థులు. ఈ దాడికి 40 మంది దుండగులు పాల్పడ్డారని సమాచారం.

YCP leader Subbarayudu killed

కేకలు వేస్తూ , తిడుతూ రోడ్డుపైనే రాళ్లతో , కత్తులతో సుబ్బరాయుడును హత్య చేశారు దుండగులు. ఇక వైసీపీ నేత సుబ్బరాయుడు హత్యతో సీతారాంపురం గ్రామం వణికిపోతోంది. ఈ సంఘటన జరుగగానే… భారీగా మోహరించాయి పోలీసు బలగాలు. ఆ గ్రామాన్ని సందర్శించారు ఎస్పీ అదిత్ రాజ్ సింగ్ రాణా. ఎన్నికల్లో వైసీపీ కి పని చేసినందుకే హత్య చేశారని సుబ్బరాయుడు భార్య సుబ్బమ్మ చెబుతోంది. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news