సీఎం చంద్రబాబుకు రూ.1 కోటి విరాళం !

-

సీఎం చంద్రబాబుకు రూ.1 కోటి విరాళం అందింది. ఈ నెల 15 నుండి అంటే రేపటి నుంచే అన్నక్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలోనే శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించడం అభినందనీయం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ సంస్థ అధినేత విజయవాడకు చెందిన పెనుమత్స శ్రీనివాసరాజు తాజాగా సచివాలయంలో ఇందుకు సంబంధించిన చెక్కును ఇవ్వడమే కాకుండా రాబోయే ఐదేళ్ల పాటు ఇంతే మొత్తం లో విరాళం అందిస్తానని తెలపడం హర్షణీయం అని కొనియాడారు.

Srilakshmi Venkateswara Developers has donated Rs. 1 crore for Annacanteens to be started from 15th of this month

ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు బాబు. పేద వాడికి అన్నంపెట్టే మంచి కార్యక్రమం మళ్ళీ ప్రారంభిస్తున్నామని తెలిసి అన్ని వర్గాల వారూ అందులో భాగస్వాములు అవుతుండడం ఆనందంగా ఉందని తెలియజేశారు. తమకు ఉన్నదాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేయాలనే వారి ఆలోచనలు అందరికీ స్ఫూర్తి దాయకం అన్నారు సీఎం చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news