BREAKING: జగన్‌ ను కలిసిన బొత్స….ఆ కీలక బాధ్యతలు అప్పగింత ?

-

BREAKING: ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్‌ జగన్‌ను కలిసిన బొత్స సత్యనారాయణ, అభినందించారు వైఎస్ జగన్.

Former Minister Botsa Satyanarayana thanked the former Chief Minister and YSRCP President Shri YS Jagan at the camp office

ఇందులో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్మన్‌ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్‌ రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. అయితే.. మండలి బాధ్యతలను బొత్స సత్యనారాయణకు జగన్‌ అప్పగించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news