దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని రాహుల్ గాంధీ ప్లాన్..!

-

దేశం మీద దేశ ప్రజాస్వామ్యం మీద, కోర్ట్ ల మీద రాహుల్ గాంధీ కి నమ్మకం లేదు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు ఆహ్వానించావు రేవంత్ రెడ్డి. వ్యాపారాన్ని విస్తరించాలని రాజీవ్ గాంధీ తనను కోరారు అని అదానీ చెప్పారు హిండెన్ బర్గ్ ను అడ్డం పెట్టుకొని ఏమీ చేద్దామని అనుకుంటున్నారు. భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా.. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనే ఈ ప్లాన్ అంటూ రఘునందన్ రావు అన్నారు.

అలాగే రాహుల్ గాంధీ తాను బ్రిటిష్ పౌరుడిని అని ఇచ్చిన వివరాలతో సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. దాని నుండి డైవర్ట్ చేయడానికే రాహుల్ ఇదంతా చేస్తున్నారు. బ్లిట్జ్ లో రాహుల్ గాంధీ కి పిల్లలు ఉన్నారని రాశారు.. భార్య ఉందని రాసింది. బ్లిట్జ్ లో వచ్చిన వార్తను ఎందుకు నమ్మడం లేదు. బ్లిట్జ్ లో వచ్చిన దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఆ ఫోటో లో ఉంది నీ శ్రీమతా కాదా చెప్పు అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news