రాజధాని రైతులకు శుభవార్త…ఆ రోజున కౌలు నిధులు జమ

-

రాజధాని రైతులకు శుభవార్త చంద్రబాబు సర్కార్‌ శుభవార్త చెప్పింది. కౌలు నిధులు జమ చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను త్వరలో విడుదల చేయబోతున్నామని వెల్లడించారు ఏపీ మంత్రి నారాయణ. వచ్చే నెల 15 వ తేదీలోగా రైతులకు కౌలు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు ఏపీ మంత్రి నారాయణ.

Good news for the farmers of the capital is good news of Chandrababu Sarkar

నిధులు విడుదలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారాయణ. ఇక అటు కార్మిక శాఖపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు…పరిశ్రమల్లో ప్రమాద నివారణ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహణపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు….ధర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్ చేయించడం ఎంత వరకు కరెక్ట్ అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. తనిఖీలు జరపడం.. పరిశ్రమలకు వ్యతిరేకం కాదనే విషయాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించనుంది సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news