శ్రీకాకుళం : వరదలో కొట్టుకుపోయిన టాటా ఏస్ వాహనం

-

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటమే కారణమని అధికారులు వెల్లడించారు. అయితే, బుడమేరు వాగుకు ఇప్పటికే వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో విజయవాడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఓవైపు బుడమేరు కాలువకు పడిన గండ్లను అధికారులు పూడుస్తున్నారు. మరోసారి భారీ వరద వస్తే కాలువకు మళ్లీ గండ్లు పడే అవకాశం ఉండగా..ముంపు ప్రాంతాల ప్రజలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెజ్జిపురం నుంచి బుడతవలస గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న గెడ్డ వాగు పొంగిపొర్లుతోంది. ప్రధాన రహదారిపైకి భారీగా నీరు చేరడంతో అదే సమయంలో అటుగా వచ్చిన టాటా ఏస్
గూడ్స్ వెహికిల్ వాగు దాటే ప్రయత్నం చేసింది. వరద ఉధృతి దాటికి ఆ వాహనం ప్రవాహంలో కొట్టుకుపోగా అప్రమత్తమైన స్థానికులు వ్యాన్ డ్రైవర్‌ను రక్షించి ఒడ్డుకు చేర్చారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news