చంద్రబాబు ఇంటిని ముందు కూలగొట్టాలి : ఎంపీ విజయసాయి రెడ్డి

-

ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముందుగా కూలగొట్టాలని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.‘సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదనే నానుడి ఉంది. పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్న ఆయనకు బుడమేరు రివలైట్ పై ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం ఎక్కుడుంటుంది? అందుకే ముందుగా ఆయన నివాసాన్ని కూలగొట్టాలి’ అని ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవల విజయవాడ నగరం ముంపునకు గురవ్వడానికి బుడమేరు వాగే కారణం.అయితే, దానికి ఆనుకుని అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో ఏపీప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే కృష్ణ నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు నివాసాన్ని ముందుగా కూల్చాలని ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.లేనియెడల బుడమేరు సమీపంలోని నిర్మాణాలను సైతం ముట్టుకోరాదని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news