ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రుల సమావేశం..!

-

నూతన ఎక్సైజ్ పాలసీపై కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్ , సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్ ల సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఏపీలో మధ్యం విధానం పై ఏర్పాటయిన సబ్ కమిటీ అయిదుగురు మంత్రులుతో సీఎం ఏర్పాటు చేశారు. గతంలో మధ్యం వ్యవస్ధను వారి గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఎక్సైజ్ వ్యవస్ధను నాశనం చేశారు. 70శాతం మందితో ఎస్ ఈ బి అని పెట్టి ఎన్సెర్స్మెంట్ లేకుండా చేశారు. ప్రభుత్వ షాపుల్లో జే బ్రాండ్ లను మాత్రమే అందుబాటులో ఉంచి విచ్చల విడిగా దోచేశారు. మధ్యపాన నిషేదం అని దశలవారీగా ఎత్తేస్తామని చెప్పి పదేపదే మాటమార్చారు విపరీతమయిన రేట్లు పెట్టి సామాన్యులను అప్పులు పాలు చేశారు… సామాన్యలు ఆధాయాన్ని దోపిడీచేశారు.

ఈ దోపిడీ ఆదాయాన్ని వారి జేబుల్లోకి వెళ్ళిపోయింది… అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్ పై తెచ్చి దోచేశారు. నాశిరకం అయిన బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలు అయి చాలామంది మృత్యువాత పడ్డారు. డిస్టలరీల వ్యవస్ధను మొత్తం వారి చేతుల్లోకి తీసుకున్నారు. షాపులలో 150 ది ఉందా 200 ది ఉందా అని అడగాల్సి వచ్చింది. నాశిరకం మధ్యం తాగలేక నాటుసారా, ఎన్ డి పి ఎల్ లకు వెళ్లిపోయారు. తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సానుండి ఎక్కవ మధ్యం రాష్ట్రానికి వచ్చింది. 1994 తరువాతఏపీలో పాలసీ దేశానికే ఆదర్శం అయ్యింది. ఇప్పడు ఆరు రాష్ట్రాలు వెళ్లి అక్కడ పాలీసీ, టాక్సేషన్ విధానంపై అధ్యయనం చేశారు. కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు ఇస్తామని చెప్పాము. ఈరోజు నాల్గవ సమావేశం అయ్యింది. రేపు క్యబినెట్ ముందు మా ప్రతిపాదనలను సరసమైన ధరలకు నాణ్యంమైన మధ్యం అందించాలని నిర్ణయించాం. రేట్లు పెంచడం వల్ల చాలామంది గంజాయికి, డ్రగ్స్ కు డైవర్ట్ అయ్యారు. మరోవైపు మధ్యం నియంత్రణకు కొంత ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించాం అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news