గత వైసీపీ ప్రభుత్వం పై RRR సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష నేతలు స్పందించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్పందించి గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీసినందుకే వైసీపీని ఆ వేంకటేశ్వరస్వామి ఓడించారని పేర్కొన్నారు. 

శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో గత టీటీడీ బోర్డు పని చేసిందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ తయారీ విషయంలో దారుణానికి తెగించారని విమర్శించారు. లడ్డుల తయారీ కోసం వాడిన పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉన్నట్టు పరీక్షల్లో తేలిందన్నారు. కావాలని సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కాదని విమర్శించారు. తిరుమలలో ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని.. భక్తులు భస చేసే ధరలు తగ్గించాలని RRR అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news