పార్టీ మారకపోతే జైలులోనే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

-

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుభవించిన జైలు జీవితం గురించి తాజాగా మీడియాతో వెల్లడించారు. ముఖ్యంగా పార్టీ మారకపోతే.. తనను జైలులో చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయన్నారు. ఆప్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జనతాకీ అదాలత్ కార్యక్రమంలో సిసోడియా మాట్లాడారు. జైలులో నన్ను బెదిరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. మద్యం కేసులో కేజ్రీవాలే నా పేరు చెప్పి.. ఇరికించారని చెప్పేవారు.

కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే.. నన్ను కాపాడతామని పేర్కొన్నారు. కోర్టు ముందు కేజ్రీవాల్ గురించి చెబితే.. నన్ను కాపాడుతామన్నారు. తమ పార్టీలో చేరాలని బీజేపీకి చెందిన వ్యక్తుల నుంచి ఒత్తిడి కూడా వచ్చిందని వెల్లడించారు. జైలులో మానసికంగా కుప్ప కూల్చేందుకు ప్రయత్నించారు. బీజేపీలో చేరకుంటే చంపేస్తామన్నారు. నువ్వు చనిపోతే.. నీ గురించి ఆలోచించే వారు ఎవ్వరూ లేరని చెప్పేవారు. తాను జైలులో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు పెట్టారని మీడియాతో వెల్లడించారు సిసోడియా.

Read more RELATED
Recommended to you

Latest news