తిరుమలలో జగన్‌పై దాడికి కుట్ర…వైసీపీ పోస్ట్ !

-

తిరుమలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై భారీ కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్మోహన్ రెడ్డి పై తిరుమల లో దాడి చేసేందుకు కూటమి పార్టీలు కుట్రలు చేస్తున్నాయని వైసీపీ పెట్టింది. బిజెపి పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్ అలాగే టిడిపి నేతలు డబ్బులు ఇచ్చి గుండాలను రంగంలోకి దింపారని.. వారందరూ తిరుమల లో జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే ఛాన్స్ ఉందని కూడా వైసిపి… సంచలన ఆరోపణలు చేసింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వాహనాలపై గుడ్లు వేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో మనుషులను… పురమాయించారని కూడా… వైసీపీ స్పష్టం చేస్తోంది. దీనిపై పోలీస్ శాఖ దృష్టి పెట్టాలని కూడా కోరింది.

ఇది ఇలా ఉండగా…జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో…. కూటమి పార్టీలు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లే మార్గంలో శాంతియుత నిరసనలు తెలుపాలని… కూటమి పార్టీలు నిర్ణయం తీసుకుంది. లడ్డు కల్తీ కి జగన్మోహన్ రెడ్డి కారణమని… నిరసన తెలుపాలని… కూటమిలో ఉన్న కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news