జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చట్లేదు.. హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

-

జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చట్లేదని  హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే హైడ్రా బాధ్యత అన్నారు. సోషల్ మీడియాలో హైడ్రా పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్ పూర్ లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి.. ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ నిర్మించారు. ఆసుపత్రి లేకపోయినా ఆసుపత్రి ఉన్నట్టు ప్రచారం చేసారు.

కొందరూ బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని.. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తాము కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవని స్పష్టం చేశారు. జన్వాడా ఫామ్ హౌజ్ 111 పరిధిలో ఉందని.. అది హైడ్రా పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. హైడ్రా పరిధిలో ఉన్నది ఏదైనా సరే.. తప్పకుండా కూల్చేస్తామని తెలిపారు. తాము సైలెంట్ గా ఉండటం లేదు.. ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు వెల్లడించారు హైడ్రా కమిషనర్.

Read more RELATED
Recommended to you

Latest news