అక్కకు మద్దతుగా.. వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా : రఘునందన్ రావు

-

తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి BRS సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అలాగే అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా అని తెలిపారు.

అయితే ఈ రాజామైన పోస్టు పెట్టిన అకౌంట్ DP హరీష్ రావు ఫోటో, KCR ఫోటో ఉంది. పోస్టులు పెట్టిన వారు BRS వాళ్ళు అయితే.. మీరే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. కానీ ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారు అనుకోలేదు. కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియా ను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు అనుకుంటే పోలీసు కంప్లయింట్ ఇవ్వండి. మహిళల మీద BRSకు గౌరవం లేదు. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. నా వల్ల మా అక్కకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా అని రఘునందన్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news