భక్తుల మనోభావాలను పురందేశ్వరీ పట్టించుకోవాలి : రోజా

-

తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఏమైనా మాట్లాడవచ్చన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గు చేటు అని మండిపడ్డారు. బావ కళ్లలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పని చేయాలంటూ సలహా ఇచ్చారు. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్నారు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మీరు బీజేపీ అధ్యక్షురాలా..? టీడీపీ అధ్యక్షురాలా..? అర్థం కావడం లేదని పురందేశ్వరి గురించి ఆసక్తికర కామెంట్స్  చేశారు. ఇదేమి సినిమా షూటంగ్ కాదు.. రోజుకో వేషం, పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదు.. అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news