పవన్ కళ్యాణ్ ఇలాకాలో జానీలు రెచ్చిపోతున్నారు – వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు అయిందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అన్నీ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. దసరా పండుగ వేళ.. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు.

ప్రధానంగా పిఠాపురంలో జానీలు పెట్రేగిపోతున్నారని.. తాజాగా ఓ మైనర్  బాలిక పై అత్యాచారం జరిగిందని గుర్తు చేశారు. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసుల తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. ముందుగా పోలీసులు స్పందిస్తే.. ఆ పాప బతికేది అన్నారు. వైసీపీ అధినేత జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి కూటమి ప్రభుత్వం అక్కడ వాలిపోయిందన్నారు. సాక్షాత్తూ సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే.. ఇక ఎవ్వరికీ చెప్పుకోవాలని ప్రశ్నించారు. ముచ్చు మర్రి ఘటనలో ఆ చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేదని.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ పై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.. అసలైనా మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తామని పేర్కొంది శ్యామల.

Read more RELATED
Recommended to you

Latest news