నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన..

-

CM Revanth Reddy laid the foundation stone for integrated schools today: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో కీలక ప్రాజెక్ట్‌ ప్రారంభించనుంది. నేడు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు షాద్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు శంకుస్థాపనలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth Reddy laid the foundation stone for integrated schools today

మధిరలోని బొనకల్‌ మండలం లక్ష్మీపురంలో శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది ఇలా ఉండగా.. రేవంత్ రెడ్డి చిత్రంతో బతుకమ్మ పేర్చారు. ఈ సంఘటన కేటీఆర్‌ నియోజక వర్గం సిరిసిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలు పేర్చి బతుకమ్మను చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news