ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. గోదావరి పుస్కరాలకు భారీగా నిధులు

-

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో జరిగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2027లో జరుగనున్న గోదావరి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027 జరుగనున్న గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు విడుదల చేసింది.

తూర్పు గోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు జరిగాయి. 2027లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్రం ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గోదావరి పుస్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ నివేదిక కూడా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news