అదుపు తప్పిన కారులో 538 కేజీల గంజాయి

-

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి కూడలి వద్ద భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్న ఓ వాహనం ఇవాళ తెల్లవారుజామున చింతలవీధి గ్రామంలోని రోడ్డు పక్కన ఓ రేకుల ఇంట్లోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. ఎంత ప్రయత్నించినా కారు బయటకు రాకపోవంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పాడేరు పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు.

కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసి తూకం వేయగా 538 కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని సీఐ దీనబంధు తెలిపారు. కారుతోపాటు గంజాయిని పాడేరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన సరకు విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని సీఐ మీడియాకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news