నేడు హైదరాబాద్ లో భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి మ్యాచ్

-

భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ హైదరాబాద్ వేదికగా మూడో టి20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే బ్యాటింగ్ లో  అదరగొడుతూ.. బౌలింగ్ తో విజృంభిస్తూ..జోరు మీదున్న కుర్రాళ్లు. అవకాశాలను అందుకుంటూ.. బంగ్లాను ఓ ఆట  ఆడుకుంటున్నారు. ఇప్పటికే సిరీస్ టీమిండియా కైవసం చేసుకుంది. ఇక క్లీన్ స్వీప్ లక్ష్యంగా శనివారం చివరి మూడో టీ20లో భారత్ బరిలోకి దిగుతోంది. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యర్థిని ఊడ్చేయాలన్నదే లక్ష్యం.

బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్లో చివరి మ్యాచ్ కి టీమ్ండియా సిద్ధమైంది. యువ రక్తంతో నిండిన సూర్యకుమార్ సేన ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లో  విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  హైదరాబాద్ లోని రాజీవ్  గాంధీ అంతర్జాతీయ క్రికెట్  స్టేడియంలో దసరా రోజు  విజయాన్ని కొనసాగించేందుకు కుర్రాళ్లు సై అంటున్నారు. మరి విజయదశమి పండుగ రోజు మన యువ ఆటగాళ్లు ఎలాంటి పండగ విందు అందిస్తారో  ఇవాళ రాత్రి వరకు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news