తల్లి పై మనసుపడి పిల్లలను హత్య చేసి..!

-

సూరారం లో చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబం మొత్తం హత్య చేసేందుకు స్కెచ్ వేసాడు నిందితుడు. పాప తల్లి సుమపై మనసుపడ్డ నిందితుడు తిరుపతి.. కుటుంబం లో ముందుగా ఇద్దరు పిల్లలను, తర్వాత ఆమె భర్త ను హత్య చేసేందుకు ప్లాన్ వేసాడు. హత్య చేసి ముళ్ళ పొదల్లో పారవేస్తే ఎవరూ గుర్తించలేరు అనుకున్న నిందితుడు.. గుర్తించే లోపు మరో పాప ను హత్య చేసేందుకు ప్లాన్ చేసాడు.

సుమకి భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సుమ ఇల్లు కట్టడానికి వచ్చిన మేస్త్రీ ప్రభాకర్.. సుమ కి భర్త లేకపోవడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రభాకర్ కి భార్య.. నలుగురు పిల్లలు ఉండగా.. భార్య తో ఉంటూనే సుమతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ప్రభాకర్ స్నేహితుడు తిరుపతి. ఒకే ఊరు కావడంతో పలుమార్లు తిరుపతిని ప్రభాకర్ ఇంటికి తీసుకెళ్లగా.. సుమ పై మనసుపడ్డ తిరుపతి తన ఇష్టాన్ని పంచుకోగా.. పిల్లలు, భర్త ఉన్నాడు అని ఆమె నిరాకరించింది. సుమను పొందాలంటే.. పిల్లలు, భర్తను అంతం చేయాలని ప్లాన్ చేసిన తిరుపతి.. 12న ఇంటి బయట ఆడుకుంటున్న సుమ పెద్ద కూతురుకు మాయమాటలు చెప్పి బైక్ పై తీసుకెళ్లి.. మేడ్చల్ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి ఏడేళ్ల పాపపై లైంగిక దాడి చేసి కత్తి తో పొడిచి చంపేశాడు. ఆ పాపా కిడ్నాప్ కేసు పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తిరుపతిని గుర్తించి అదుపులోకి తీసుకోగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news