ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, ఆలయాల పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం, కొత్త మున్సిపాలిటీలలో పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు.

ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కి ఆమోద ముద్ర వేసింది. 20లక్షాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీ తీసుకొచ్చారు. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Read more RELATED
Recommended to you

Latest news