గీతారెడ్డికి సద్భావన అవార్డు ఇవ్వడం సంతోషకరం : మహేష్ కుమార్ గౌడ్

-

గీతారెడ్డికి సద్భావన అవార్డు ఇవ్వడం సంతోషకరం అన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ సద్భావన యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ కోసం గాంధీ కుటుంబం ఆస్తులను దానం చేసింది. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగం చేసింది. 21వ శతాబ్దం కోసం రాజీవ్ ఎంతో కృషి చేశారు.  భారతదేశం ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు పొందడానికి కాంగ్రెస్ పార్టీ అన్నారు. 

నిజాం దూర దృష్టితోనే హైదరాబాద్ సిటీని అభివద్ధి చేశారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా.. డాక్టర్ గా ఉన్న ఆమె రాజీవ్ గాంధీ కోసం డాక్టర్ ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది గీతారెడ్డి. గీతారెడ్డికి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించడం ఆషామాషీ కాదన్నారు. ఈ  హైదరాబాద్ నగరం అందరిదీ అన్నారు. కేసీఆర్ కుటుంబం 9 నెలల్లో అధికారం పోయిందనే అక్కాసుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అబద్ధపు ప్రచారాలు చేశారు. మతాలుకులాల పేరుతో బీజేపీ విభజిస్తోందన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news