హైడ్రా, మూసీ పునరుజ్జీవనం రెండు వేర్వేరు : సీఎం రేవంత్ రెడ్డి

-

హైడ్రా, మూసీ పునరుజ్జీవం రెండు వేర్వేరు  అని  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతాడు. చెరువులను, కుంటలను ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతాడు. ప్రభుత్వ భూములను అమ్ముకొని దాని పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్లు భయపడుతుండ్రు తప్ప సొంతంగా ఆస్తులు ఉన్న వాళ్లు, అనుమతులు ఉన్నవాళ్లు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అనుమతులు ఉన్న వాళ్లను ఏవిధంగా కాపాడాలో ప్రభుత్వానికి తెలుస్తోంది. ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవ్వరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే.. అధికారులకు చూపించండి. అనుమతి ఉన్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. కొంత మంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ ని దెబ్బతీయాలని ఉన్నవి లేనివి.. సోషల్ మీడియాలో పెట్టి యూనివర్సిటీలలో ప్రచారం చేస్తున్నారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news