Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..టికెట్లపై కీలక ప్రకటన !

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేశారు. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపులు చేశారు. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు చేస్తారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..టికెట్లపై కీలక ప్రకటన !

ఇది ఇలా ఉండగా.. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. 80,741 మంది భక్తులు..తిరుమలలో నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 31,581 మంది భక్తులు..తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news