జగన్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

-

“జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా.. నువ్వు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ సార్ నమస్కారం సార్ అని నాకు నమస్కారం పెట్టాలి” అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం పెద గొలుగుండ పేట గ్రామం లో “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీకి రావాలని ఆహ్వానిస్తున్నాను ఇద్దరం కలిసి ముచ్చటించుకుందాం. తనకు నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదు అని ఎద్దేవా చేశారు.

నర్సీపట్నం నియోజకవర్గానికి 100 రోజుల్లోనే రూ. 40 కోట్ల రూపాయలు తీసుకువచ్చానని.. నాతవరం మండలానికి సుమారు రూ. 14 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు తెచ్చినట్లు చెబుతున్నారు. కానీ తాండవ గేటు మరమ్మతులకు రూ. 3 లక్షలు ఇవ్వలేకపోయారు. తాండవ గేటు మరమ్మతుల కోసం రూ. 5 లక్షలు ఇచ్చి పూర్తి చేయించడం జరిగింది. పంట సీజన్ ప్రారంభమైన వెంటనే కొత్త గేట్లు ఏర్పాటు చేయిస్తామని అయ్యన్న చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news