మనం కేసీఆర్ బాటలో కాదు రాహుల్ గాంధీ బాటలో నడవాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

jeevan reddy comments on congress party: మనం కేసీఆర్ బాటలో కాదు రాహుల్ గాంధీ బాటలో నడవాలని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల హత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…మాట్లాడుతూ.. కేసీఆర్ ఆనాడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడు కాబట్టి మనం కూడా ఈ రోజు ఫిరాయింపులను ప్రోత్సహిద్దామా ? అంటూ నిలదీశారు. హత్య నిందితుడు దర్జాగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో రక్షణ పొందుతున్నాడని మండిపడ్డారు.

jeevan reddy comments on congress party

గత నాలుగు నెలలుగా నేను మానసిక అవమానాలకు గురవుతూ వస్తున్న అని చెప్పారు. నన్ను నిర్వీర్యం చేయాలని నా మనుషులపై బౌతికంగా దాడులు చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదని వివరించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. మానసిక అవమానాలు, క్షోభకు గురి కావడమే కాకుండా భౌతికంగా కూడా నష్టపోతున్నాఅన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల పర్యవసానంగా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితిని ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news