పేద, మధ్యతరగతి వారే హైడ్రా టార్గెట్ : కేటీఆర్

-

పేద, మధ్య తరగతి వారే హైడ్రా టార్గెట్ అని, వారి నిర్మాణలపైనే చర్యలు తీసుకుంటారా? బడా బాబుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోరా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, హెచ్ఎఫ్ఎల్ నిబంధనలు, భయపెట్టే వ్యూహాలు కేవలం పేదలు,మధ్యతరగతికేనా అని నిలదీశారు.

వీటి విషయంలో ధనవంతులు,పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో? అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.ఎంపిక చేసిన న్యాయాన్ని పేద,మధ్యతరగతి ప్రజల పట్ల మాత్రమే అమలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోస్టు చేసిన వీడియోను కేటీఆర్ తన ట్వీట్ కు జోడించారు. నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసీ రివర్‌లో చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించిన దృశ్యాలు అందులో ఉన్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news