తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా..భక్తులకు గాయాలు

-

తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో భక్తులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని.. దిగు తిరుపతికి సుమోలో భక్తులు వెళుతున్నారు.

Road accident at 24th turn of Tirumala first ghat road

ఈ తరుణంలోనే.. అదుపు తప్పి…తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోల్తాపడిన సుమో….పల్టీలు కొట్టింది. దీంతో సుమోలో ఉన్న భక్తులకు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే బాధితులను రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఓవర్‌ స్పీడ్‌ తో సుమో డ్రైవర్‌ వచ్చాడని అక్కడే ఉన్న భక్తులు అంటున్నారు. 24వ మలుపు కావడంతో… స్పీడ్‌ ను తట్టుకోలేక… బోల్తాపడిన సుమో….పల్టీలు కొట్టిందట.

Read more RELATED
Recommended to you

Latest news